23 మంది ఎల్పీల నియామకం
ABN , First Publish Date - 2020-06-07T07:59:32+05:30 IST
డీఎస్సీ-2018 హిందీ లాంగ్వేజ్ పండిట్(ఎల్పీ) అభ్యర్థుల నియామక ప్రక్రియకు సంబంధించి శనివారం కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయ సమావేశ
చిత్తూరు సెంట్రల్, జూన్ 6: డీఎస్సీ-2018 హిందీ లాంగ్వేజ్ పండిట్(ఎల్పీ) అభ్యర్థుల నియామక ప్రక్రియకు సంబంధించి శనివారం కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి 23 మంది హాజరయ్యారు. ఆ మేరకు 16 మందిని ఎల్పీ(ఎస్జీటీ)లుగాను, ఆరుగురిని స్కూల్ అసిస్టెంట్లుగా(ఎల్పీ)ను నియమిస్తూ డీఈవో నరసింహారెడ్డి ఉత్తర్వులు అందజేశారు. వీరందరూ ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆయన ఆదేశించారు. ఏడీ అనిత రోస్రాణి, సూపరింటెండెంట్లు నాగరాజు, కృష్ణప్ప, ఎస్వో రవిశేఖర్ పాల్గొన్నారు.