టికెట్ ధరలు తగ్గిస్తేనే రికవరీ
ABN , First Publish Date - 2021-07-28T06:54:16+05:30 IST
విమానయాన ధరలు, సామర్థ్యాలకు పగ్గాలే భారత పౌర విమానయాన శాఖ రికవరీకి పెను అవరోధంగా నిలిచాయని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ అన్నారు.
న్యూఢిల్లీ: విమానయాన ధరలు, సామర్థ్యాలకు పగ్గాలే భారత పౌర విమానయాన శాఖ రికవరీకి పెను అవరోధంగా నిలిచాయని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ అన్నారు. ప్రయాణికుల తరలింపు సామర్థ్యాలపై ఆంక్షలు తొలగించిట్టయితే విమానయానానికి డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం దేశీయ విమాన సంస్థలు రోజుకు 1700 సర్వీసులు నడుపుతున్నాయి. కరోనా ముందు కాలం తో పోల్చితే ఈ సర్వీసుల సంఖ్య 55శాతం మాత్రమే.