మొహర్రం వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్స్లు
ABN , First Publish Date - 2022-08-13T06:40:11+05:30 IST
మండలంలోని మణికేశ్వరంలో మొహర్రం వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించడం చర్చనీయాం శమైంది.
స్టేజిపైనే వైసీపీ నాయకులు
అద్దంకి, ఆగస్టు 12 : మండలంలోని మణికేశ్వరంలో మొహర్రం వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించడం చర్చనీయాం శమైంది. గత ఏడాది వరకు గ్రామంలో ముస్లింలు కలిసికట్టుగా మొహర్రం వేడుకలు నిర్వహించుకునే వారు. కానీ ఈఏడాది సీన్ పూర్తిగా మారిపోయింది. వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శాప్నెట్ చైర్మన్, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య, ఇతర నాయకులను ఆహ్వానించారు. ఇంతటితో ఆగకుండా ఏకంగా రికార్డింగ్ డ్యాన్స్లు ఏర్పాటు చేశారు. దీంతో అత్యంత భక్తిశ్రద్ధలతో జరగాల్సిన ఈ ఉత్సవాలు కాస్త రాజకీయరంగు పులుముకున్నాయి. దీంతోపాటు అసభ్య నృత్యాల ప్రదర్శన చర్చనీయాంశమైంది.