కేవీపీ స్టేట్మెంట్ను రికార్డు చేశారా?: హైకోర్టు
ABN , First Publish Date - 2021-12-09T07:15:11+05:30 IST
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో అప్పటి సీఎం వైఎస్
హైదరాబాద్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వానికి సలహా దారుగా వ్యవహరించిన కేవీపీ రామచంద్రరావు స్టేట్మెంట్ను రికార్డు చేశా రా? అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. రికార్డు చేయలేదని సీబీఐ న్యాయ వాది సమాధానం ఇచ్చారు. ఓఎంసీ మైనింగ్ లీజుల వ్యవహా రంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సీబీఐ న్యాయ వాది కె.సురేందర్ వాదనలు వినిపిస్తూ.. ఓఎంసీ మైనింగ్ లీజు లీజు కేటాయించే క్రమంలో శ్రీలక్ష్మి అధి కార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆమెపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాల్సిన అవసరం లేదన్నారు.
శశికుమార్ అనే సాక్షి స్టేట్మెంట్ను సీబీఐ న్యాయవాది ఽధర్మాసనానికి చదివి వినిపించారు. మైనింగ్ లీజు కోసం అప్పటి ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి వద్దకు వెళ్తే కేవీపీ రామచంద్ర రావును కలవాలని ఆమె చెప్పారని సాక్షి వెల్లడించినట్లు తెలిపారు. రూ.8 లక్షలు సమకూర్చాలని శ్రీలక్ష్మి కోరినట్లు సాక్షి వెల్లడించారని తెలిపారు. ఓఎంసీకి చెందిన గాలి జనార్ధన్రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు ఇతర దరఖాస్తులను శ్రీలక్ష్మి తొక్కిపెట్టారని తెలిపారు.