టర్కీలో విమానం కూలి ఏడుగురు భద్రతా అధికారుల మృతి

ABN , First Publish Date - 2020-07-16T16:03:35+05:30 IST

టర్కీ దేశంలోని పర్వత ప్రాంతంలో పరిశీలక విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు భద్రతా అధికారులు మరణించారు....

టర్కీలో విమానం కూలి ఏడుగురు భద్రతా అధికారుల మృతి

ఇస్లాంబుల్ : టర్కీ దేశంలోని పర్వత ప్రాంతంలో పరిశీలక విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు భద్రతా అధికారులు మరణించారు. టర్కీలోని పర్వత ప్రాంతంలో 2,200 అడుగుల ఎత్తులో వస్తున్న విమానం ప్రమాదవశాత్తు పర్వతాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లతోపాటు ఏడుగురు భద్రతాధికారులు మరణించారని టర్కీ దేశ మంత్రి సులేమాన్ సోయలు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంపై తాము దర్యాప్తు చేస్తున్నామని మంత్రి చెప్పారు. విమానం బయలు దేరిన 13 నిమిషాలకే రాడార్ నుంచి ఆచూకీ లభించలేదు. టర్కీ భద్రతా బలగాలు కుర్షిదిస్టన్ పార్టీ వర్కర్ మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Updated Date - 2020-07-16T16:03:35+05:30 IST