పంచాయతీలకు గుర్తింపు

ABN , First Publish Date - 2021-06-18T05:22:58+05:30 IST

పంచాయతీలకు గుర్తింపు

పంచాయతీలకు గుర్తింపు
కాచవానిసింగారం పల్లెప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న రమణమూర్తి

ఘట్‌కేసర్‌ రూరల్‌: ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్న పంచాయతీలకు తగిన గుర్తింపు లభిస్తుందని మేడ్చల్‌ జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి అన్నారు. కాచవానిసింగారంలో గురువారం ఆయన పర్యటించి పల్లెప్రకృతి వనం, అంగన్‌వాడీ కేంద్రం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయాలని పాలకవర్గాన్ని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పక్కాగా అమలు చేస్తున్న పంచాయతీలకు గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీవో అనంతలక్ష్మి, సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:22:58+05:30 IST