ఎడిన మొక్క.. అందిన నోటీసులు...
ABN , First Publish Date - 2020-07-05T10:45:58+05:30 IST
హరితహారం మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన కాసిపేట సర్పం చుతోపాటు నలుగురికి శనివారం ఎంపీడీవో ఆలీం షోకాజ్ నోటీసులు అందజేశారు
కాసిపేట, జూలై 4: హరితహారం మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన కాసిపేట సర్పం చుతోపాటు నలుగురికి శనివారం ఎంపీడీవో ఆలీం షోకాజ్ నోటీసులు అందజేశారు. కలెక్టర్ భారతి హోళికేరి శుక్రవారం కాసిపేట పంచాయ తీలో పర్యటించారు. ప్రధాన రహదారి పక్కన హరితహారంలో నాటిన మొక్కలు ఎండి పోవడం తో ఇందుకు బాధ్యులైన వారికి షోకాజ్ నోటీసులు అందజేయాలని కలెక్టర్ ఎంపీడీవోను ఆదేశించా రు. సర్పంచు ధరావత్దేవి, ఎంపీవో మేఘమాల, ఏపీవో స్వాతి, టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి లెక్కల మౌనికలకు నోటీసులు అందజేశారు. మొక్కలను సంరక్షించడంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు ఉంటాయని ఎంపీడీవో హెచ్చరించారు.