రెబల్స్‌ను బుజ్జగించేందుకు పార్టీల ప్రయత్నాలు..

ABN , First Publish Date - 2020-11-21T16:59:19+05:30 IST

గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. టిక్కెట్లు ఆశించి..

రెబల్స్‌ను బుజ్జగించేందుకు పార్టీల ప్రయత్నాలు..

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. టిక్కెట్లు ఆశించి.. చివరి నిముషంలో భంగపడ్డ పలువురు తిరుగుబాట బావుట ఎగురవేశారు. అధికార టీఆర్ఎస్ సహా పార్టీలన్నీంటికి రెబల్స్ బెదడ తప్పడంలేదు. తిరుగుబాటు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేయడంతో వారిని బుజ్జగించేందుకు పార్టీల నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీ నుంచి అధిక సంఖ్యలో ఆశావహులు ఉండడంతో పోటీ తీవ్రంగా నెలకొంది. దీంతో టిక్కెట్ దక్కనివారు పలు డివిజన్లలో రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. రామంతాపూర్ డివిజన్‌లో టీడీపీ నుంచి ఒకరు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ తరఫున కొన్ని చోట్ల రెబల్స్ బరిలో నిలిచినవారందరినీ బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరింపచేసే ప్రకియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రానికి ఎంతమంది బరిలో నిలుస్తారనేది తేలనుంది.

Updated Date - 2020-11-21T16:59:19+05:30 IST