పనాజీ: శివసేన(Shiv sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే(Eknath Shinde)ను ముఖ్యమంత్రిగా ప్రకటించగానే ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల బృందం డాన్సులు చేస్తూ ఆనందోత్సాహాలు చేసుకుంది. ప్రస్తుతం గోవా హోటల్లో ఉన్న వీరంతా టీవీలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేల ఇంటర్వ్యూ చూస్తూ డాన్సులు చేసింది. ఎమ్మెల్యేలంతా గుంపుగా చేరి డాన్సులు చేశారు. ఇందులో కొందరు టేబుల్స్పైకి ఎక్కి డాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏక్నాథ్ షిండేనే (Eknath Shinde) మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి (Maharashtra CM) అని మహారాష్ట్ర బీజేపీ ముఖ్య నేత ఫడణవీస్ (Fadnavis) ప్రకటించారు. సీఎం పదవిని ఫడణవీస్ చేపట్టకపోవడం వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేసిట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా నడిచిన ఈ ‘మహా’ సంక్షోభంలో (Maha Crisis) బీజేపీ (BJP) పాత్ర ఏం లేదని చెప్పుకునే ఉద్దేశంతోనే షిండేను సీఎంగా బీజేపీ ప్రకటించి ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. రాత్రి 7.30 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త సర్కార్ రెబల్స్ ఆధ్వర్యంలో ఏర్పడనుంది.
ఇవి కూడా చదవండి