ఏ దోపిడీని నిరూపించడానికైనా సిద్ధం
ABN , First Publish Date - 2022-05-15T07:01:59+05:30 IST
నియోజకవర్గంలో జరుగుతున్న ఏ దోపిడీని నిరూపించడానికైనా సిద్ధమని టీడీపీ పార్లమెంటు జిల్లా అధికార ప్రతినిధి బూరుగుపల్లి వీరరాఘవులు అన్నారు.
కొవ్వూరు, మే 14: నియోజకవర్గంలో జరుగుతున్న ఏ దోపిడీని నిరూపించడానికైనా సిద్ధమని టీడీపీ పార్లమెంటు జిల్లా అధికార ప్రతినిధి బూరుగుపల్లి వీరరాఘవులు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొంగూర గడ్డ లంకలో భూవివాదంలో వాడపల్లిలో బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నాయకులు సవాల్ విసిరారని, కాని వాడపల్లిలో కాకుండా ప్రెస్క్లబ్లో కూర్చుందాం రావాలని ఆయన అన్నారు. ఇసుక ర్యాంపుల్లో దోపిడీని అరికట్టడానికి ఇరు పార్టీల తరపున రోజు ర్యాంపుల్లో తనిఖీలు చేపట్టి దోపిడీని అరికడదామని కలసి రావాలన్నారు. నవంబర్ నెల నుంచి లంకలో అనుమతులు లేకుండా పాలచెట్లు నరికివేస్తున్నారన్నారు. వట్టికూటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుమారదేవం ఇసుకర్యాంపులో బాట చార్జీలపేరుతో దోపిడీ చేస్తున్నారు. ముత్యాల రాంబాబు మాట్లాడుతూ ఓపెన్ ర్యాంపులను తెరిచి పూడికతీత ర్యాంపులను మూసివేసి, ఇసుక కార్మికుల పొట్టకొట్టారన్నారు. అవినీతికంపులో మునిగిపోయిన మీకు సవాల్లు విసిరే అర్హతలేదన్నారు. హోం మంత్రి తక్షణం స్పందించి, దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.