ధోనీ ఆట చూడటం కోసం.. రెండింతల ఖర్చుకు సిద్ధం!

ABN , First Publish Date - 2020-08-15T03:56:47+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆట చూడటం కోసం టికెట్ ధర రెండింతలు పెరిగినా స్టేడియానికి వెళ్లడానికి తాను సిద్ధమని ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పాడు.

ధోనీ ఆట చూడటం కోసం.. రెండింతల ఖర్చుకు సిద్ధం!

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆట చూడటం కోసం టికెట్ ధర రెండింతలు పెరిగినా స్టేడియానికి వెళ్లడానికి తాను సిద్ధమని ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పాడు. ఐపీఎల్‌లో ధోనీ ప్రాతినిధ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. 2022 వరకు ధోనీ తమ ఫ్రాంచైజీతో కలిసి ఉంటాడని ఆయన చెప్పారు. ఈ ప్రకటన తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్న చోప్రా.. ‘ఇటీవల కాలంలో ధోనీ చెన్నై జట్టు కోసమే కనబడుతున్నాడు. అది కూడా సంతోషమే’ అని చెప్పాడు. అలాగే ఐపీఎల్ మ్యాచుల టికెట్ ధరలు రెండింతలు అయినా సరే.. ధోనీ ఆట చూడటం కోసం తాను స్టేడియానికి వెళ్లడానికి సిద్ధమని స్పష్టంచేశాడు.

Updated Date - 2020-08-15T03:56:47+05:30 IST