యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది... అఖిలప్రియకు శిల్పా రవి కౌంటర్

ABN , First Publish Date - 2020-10-31T00:31:39+05:30 IST

మాజీమంత్రి భూమా అఖిలప్రియకు ఎమ్మెల్యే శిల్పా రవి కౌంటరిచ్చారు. వైసీపీ నేత సుబ్బారాయుడును హత్య చేసింది టీడీపీ నాయకుడేనని తేల్చిచెప్పారు.

యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది... అఖిలప్రియకు శిల్పా రవి కౌంటర్

కర్నూలు: మాజీమంత్రి భూమా అఖిలప్రియకు ఎమ్మెల్యే శిల్పా రవి కౌంటరిచ్చారు. వైసీపీ నేత సుబ్బారాయుడును హత్య చేసింది టీడీపీ నాయకుడేనని తేల్చిచెప్పారు. హత్య చేసిన వ్యక్తి భూమా కుటుంబంతో ఫోటోలు దిగారని, అక్రమ వ్యాపారాలు చేశారని ఆరోపించారు. హత్య వెనుకున్న కుట్రదారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యా రాజకీయాలతో భయపెడితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరని హెచ్చరించారు. నంద్యాలలో యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. భూమా కుటుంబం వల్లే ఆళ్ళగడ్డ అభివృద్ధికి చెందలేదని ధ్వజమెత్తారు. 2014 నుంచి భూమా కుటుంబం తమపై దాడులకు పాల్పడిందని. తాము అధికారంలోకి వచ్చినా ఏనాడు కక్ష సాధించలేదని శిల్పా రవి చెప్పారు. 


ఇటీవల నంద్యాలలో వైసీపీ నేత, న్యాయవాది సుబ్బరాయుడుని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కర్రలతో కొట్టి ఆయన్ను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ హత్యపై భూమా, శిల్పా కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇది ఎంతదాక వెళ్లిందంటే భూమా అఖిలప్రియ, శిల్పా రవిలు సవాల్ విసురుకునే దాకా వెళ్లింది. దమ్ముంటే సుబ్బారాయుడు హత్యకేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందని వారం లోపల నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తమపై తప్పుడు కేసులు పెడితే విడిచిపెట్టనని హెచ్చరించారు. శిల్పా రవి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నంద్యాల డివిజన్‌లో ఏది జరిగినా భూమా కుటుంబం మీద బురదజల్లుతున్నారని మండిపడ్డారు. శిల్పా రవి పుట్టక ముందే తన తండ్రి భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో ఉన్నారని, తన తండ్రి మీద కేసుల మీద కేసులు పెట్టి హింసించారని అఖిలప్రియ తెలిపారు.

Updated Date - 2020-10-31T00:31:39+05:30 IST