మరో నాలుగు

ABN , First Publish Date - 2020-06-07T07:47:20+05:30 IST

జిల్లాలో శనివారం నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. కారంచేడు మండలం కొడవలివారిపాలెం, టంగుటూరు, ఒంగో లు, శింగరాయకొండ మండలం నందనవనం గ్రామాల్లో ఇవి వెలుగు

మరో నాలుగు

జిల్లాలో 117కి చేరిన 

కరోనా పాజిటివ్‌ కేసులు


ఒంగోలు నగరం, జూన్‌ 6: జిల్లాలో శనివారం నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. కారంచేడు మండలం కొడవలివారిపాలెం, టంగుటూరు, ఒంగో లు, శింగరాయకొండ మండలం నందనవనం గ్రామాల్లో ఇవి వెలుగు చూశాయి. దీంతో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ల సంఖ్య 117కి చేరింది. కొత్త కేసుల్లో టంగుటూరు వ్యక్తి మధురై నుంచి వచ్చి నేరుగా ఒంగోలులోని క్వారంటైన్‌కు వెళ్లారు. ఒంగోలు కేసు ఢిల్లీ నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక నందనవనంలో పాజిటివ్‌గా తేలిన బాధితుడు హర్యానా నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇప్పుడు పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీంతో ఆ గ్రామాన్ని  కంటైన్మెంట్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - 2020-06-07T07:47:20+05:30 IST