రీ సర్వే పనులు వేగవంతం : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-07-06T07:14:37+05:30 IST

జిల్లాలో జగనన్న భూహక్కు, భూ రక్షా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న రీసర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధి కారులను ఆదేశించారు.

రీ సర్వే పనులు వేగవంతం : కలెక్టర్‌
సమావేశంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

కాకినాడ సిటీ, జూలై 5: జిల్లాలో జగనన్న భూహక్కు, భూ రక్షా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న రీసర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధి కారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ ఇలాక్కియా, రెవెన్యూ, సర్వేశాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌తోపాటు సర్వే పనులను సమీక్షించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వే ఆఫ్‌ ఇండియా సహ కారంతో జరుగుతున్న ఈ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కాకినాడ డివిజన్‌ డ్రోన్‌ సర్వే పనులు ఈ నెలాఖరు నాటికి, పెద్దాపురం డివిజన్‌ సర్వే పనులు అక్టోబరు చివరికి పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో సర్వే ఏడీ బి లక్ష్మీనారాయణ, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు బీవీ రమణ, జె సీతారామారావు, పెద్దాపురం డీఐవోఏఎస్‌ ఎం జ్యోషిల పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T07:14:37+05:30 IST