ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో

ABN , First Publish Date - 2021-03-05T05:05:54+05:30 IST

వావిలేరు, మైపాటి వారి కండ్రిక గ్రామాలలో ఈ నెల 15వ తేదీన పంచాయ తీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఆర్డీవో గోనుగుంట సువర్ణమ్మ గ్రామంలో పర్యటించారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో

చేజర్ల, మార్చి 4: వావిలేరు, మైపాటి వారి కండ్రిక గ్రామాలలో ఈ నెల 15వ తేదీన పంచాయ తీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఆర్డీవో గోనుగుంట సువర్ణమ్మ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సచివాలయంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత ఎన్నికలు జరిగేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు సంబంధించి 4వ తేదీ నుంచి 6వ తేదీ వర కు నామినేషన్ల స్వీకరణ, 7న పరిశీలన, 8న అభ్యంతరాల స్వీకరణ, 7న ఉపసంహరణ, 10న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో, ఎంపీడీవో వి.వెంకటశేషయ్య, తహసీల్దారు శ్మామసుందరరాజ, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T05:05:54+05:30 IST