వైద్యసేవలపై ఆర్డీవో పరిశీలన

ABN , First Publish Date - 2021-05-09T04:49:16+05:30 IST

సంగంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితు ల ఇళ్లకు వెళ్లి అందుతున్న వైద్యసేవలను ఆర్డీవో చైత్ర వర్షిణి శనివారం పరిశీలించారు.

వైద్యసేవలపై ఆర్డీవో పరిశీలన

సంగం, మే 8:  సంగంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితు ల ఇళ్లకు వెళ్లి అందుతున్న వైద్యసేవలను ఆర్డీవో చైత్ర వర్షిణి శనివారం పరిశీలించారు. బస్టాండ్‌ సెంటర్‌, మెయిన్‌బజార్‌ తదితర ప్రాంతాల్లో వైద్యసేవలు అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలు, అందచేస్తున్న మందుల వివరాలను వైద్యాధికారి మంజుల ను అడిగారు. ఆమె వెంట తహసీల్దారు రవికుమార్‌, వీఆర్వో మోహన్‌, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-09T04:49:16+05:30 IST