పకడ్బందీగా భూముల రీ సర్వే : ఆర్డీవో రచన
ABN , First Publish Date - 2021-11-28T05:20:47+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం సర్వే పకడ్బందీగా ఉండాలని ఏలూరు ఆర్డీవో రచన తెలిపారు.
ఏలూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం సర్వే పకడ్బందీగా ఉండాలని ఏలూరు ఆర్డీవో రచన తెలిపారు. కలెక్టరేట్లో శనివారం ఆమె వ్యవసాయ భూముల రీ–సర్వేపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోగ్రాంపై (ఎస్వోపీ) నరసాపురం, ఏలూ రు, కొవ్వూరు డివిజన్లలోని 24 మండలాల తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు.