ఆర్డీవో సచివాలయాల సందర్శన
ABN , First Publish Date - 2021-10-29T03:09:37+05:30 IST
మండలంలోని విందూరు, రామలింగాపురం గ్రామాల్లోని సచివాలయాలను గురువారం ఆర్డీవో మురళీకృష్ణ పరిశీలించారు.
గూడూరు, అక్టోబరు 28: మండలంలోని విందూరు, రామలింగాపురం గ్రామాల్లోని సచివాలయాలను గురువారం ఆర్డీవో మురళీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందించేందుకు సచివాలయాల సిబ్బంది కృషి చేయాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.