ఏసీబీ ట్రాప్‌లో ఆర్డీవో

ABN , First Publish Date - 2021-11-30T23:24:13+05:30 IST

ఏసీబీ వలలో భారీ అవినీతి చేప

ఏసీబీ ట్రాప్‌లో ఆర్డీవో

పెద్దపల్లి: ఏసీబీ వలలో భారీ అవినీతి చేప చిక్కింది. ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆర్డీఓ దొరికిపోయాడు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్‌గా పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టర్ గైక్వాడ్ రజనీకాంత్ ఇచ్చిన లక్ష రూపాయలను తన బంధువు ద్వారా తీసుకుంటుండగా ఆర్డీఓను ఏసీబీ పట్టుకుంది. చేసిన పనులకు బిల్లులు చెలించేందుకు  కొన్నిరోజులుగా కాంట్రాక్టర్‌ను ఆర్డీఓ ఇబ్బందులు పెడుతున్నాడు. పర్సంటేజ్ ఇస్తేనే సంతకం పెడుతానని ఆర్డీఓ స్పష్టం చేశాడు. దీంతో అంత లంచం ఇచ్చుకోలేక ఏసీబీని కాంట్రాక్టర్ ఆశ్రయించాడు.  



Updated Date - 2021-11-30T23:24:13+05:30 IST