ఆర్డీవో సామాన్యుడిగా..
ABN , First Publish Date - 2020-04-04T10:05:09+05:30 IST
ఆదోని ఆర్డీవో బాలగణేశయ్య శుక్రవారం మారు వేషంలో ఆదోని మున్సిపల్ మైదానంలోని రైతుబజార్కు వెళ్లారు.
మారు వేషంతో రైతు బజార్ ధరలపై ఆరా
ఆదోని రూరల్, ఏప్రిల్ 3: ఆదోని ఆర్డీవో బాలగణేశయ్య శుక్రవారం మారు వేషంలో ఆదోని మున్సిపల్ మైదానంలోని రైతుబజార్కు వెళ్లారు. కూరగాయలు అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయన ఇలా చేశారు. తొలుత ఓ దుకాణం వద్దకు వెళ్లి కిలో పచ్చిమిర్చి కిలో రూ.25కు కొనుగోలు చేశారు. అలాగే వంకాయలు కిలో రూ.20కి కొన్నారు. ఈ రెండింటిపై కిలోకు రూ.5 అదనంగా తీసుకుంటున్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.