తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
ABN , First Publish Date - 2021-04-15T01:20:47+05:30 IST
ఐపీఎల్ 2021లో భాగంగా సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఈ సీజన్లో తొలి సారి బరిలోకి..
చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఈ సీజన్లో తొలి సారి బరిలోకి దిగిన దేవ్దత్ పడిక్కల్(11: 13 బంతుల్లో.. 2 ఫోర్లు) భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో అవుటయ్యాడు. భువీ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా పుల్ చేయబోయిన పడిక్కల్.. అక్కడ షహబాజ్ నదీమ్కు క్యాచ్ ఇచ్చాడు. నదీమ్ అద్భుతంగా లెఫ్ట్ సైడ్ డైవ్ చేసి సూపర్ క్యాచ్ అందుకున్నాడు. కాగా.. 3 ఓవర్లకు ఆర్సీబీ ఒక వికెట్కు 20 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(6: 4 బంతుల్లో.. ఒక ఫోర్), షహబాజ్ అహ్మద్(0) క్రీజులో ఉన్నారు.