అర్ధ సెంచరీలతో అదరగొట్టిన Kohli, Patidar.. బెంగళూరు భారీ స్కోరు

ABN , First Publish Date - 2022-04-30T23:03:38+05:30 IST

కోహ్లీ, రజత్ పటీదార్ అర్ధ సెంచరీలతో రాణించడంతో గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో

అర్ధ సెంచరీలతో అదరగొట్టిన Kohli, Patidar.. బెంగళూరు భారీ స్కోరు

ముంబై: కోహ్లీ, రజత్ పటీదార్ అర్ధ సెంచరీలతో రాణించడంతో గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 11 పరుగుల వద్ద కెప్టెన్ ఫా డుప్లెసిస్ (0) వికెట్‌ను కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ రాణించడంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 58, పటీదార్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసి అవుటయ్యారు.


మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న దినేశ్ కార్తీక్ (2) మరోమారు నిరాశపరిచాడు. మహిపాల్ లోమ్రోర్ 8 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 16 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టైటాన్స్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ రెండు వికెట్లు తీసుకోగా, షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గ్యూసన్ చెరో వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2022-04-30T23:03:38+05:30 IST