రూ. 36 లక్షలు... సీబీఐకి ఆర్బీఐ జరిమానా
ABN , First Publish Date - 2022-04-23T01:40:21+05:30 IST
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ)పై... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ. 36 లక్షల జరిమానా(ద్రవ్య పెనాల్టీ)ను విధించింది.
ముంబై : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ)పై... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ. 36 లక్షల జరిమానా(ద్రవ్య పెనాల్టీ)ను విధించింది. ఆర్బీఐ జారీ చేసిన ఆయా ఆదేశాలను పాటించకపోవడంతో... సీబీఐ ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. వాస్తవానికి... ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నాలుగు రోజుల క్రితమే(ఏప్రిల్ 18 న) జారీ అయ్యాయి. ‘కస్టమర్ ప్రొటెక్షన్-లిమిటింగ్ లయబిలిటీ ఆఫ్ కస్టమర్స్ ఇన్ అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్' అంశంపై జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు రుణదాతకు జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్ 46(4)(i), సెక్షన్ 51(1) లోని సెక్షన్ 47ఏ(1)(సీ) నిబంధనల ప్రకారం... ఆర్బీఐకి ఉన్న అధికారాల నేపథ్యంలో... ఈ జరిమానా ను విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ చర్య... రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల ప్రాతిపదికన ఉంటుందని, బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ, లేదా... ఒప్పందం యొక్క చెల్లుబాటుపై ఉచ్ఛరించడానికి ఉద్దేశించినదని పేర్కొంది. మార్చి 31, 2020 నాటికి సెంట్రల్ బ్యాంక్ తన ఆర్థిక స్థితిగతులను సూచిస్తూ సీబీఐ యొక్క సూపర్వైజరీ మూల్యాంకనం(ఐఎస్ఈ) కోసం చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించినట్లు ఆర్బీఐ పేర్కొంది.