ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్కి జైలు శిక్ష.. రాయదుర్గం కోర్టు కీలక తీర్పు
ABN , First Publish Date - 2022-05-20T18:00:59+05:30 IST
రాయదుర్గం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డికి జైలుశిక్ష విధించింది.
అనంతపురం : రాయదుర్గం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డికి జైలుశిక్ష విధించింది. అధికారులను బెదిరించిన కేసులో శ్రీనివాస్ రెడ్డికి మూడేళ్లు జైలుశిక్ష విధించారు. రూ.5 వేలు జరిమానా విధిస్తూ రాయదుర్గం కోర్టు తీర్పును వెలువరించింది. అనుమతికి మించి ఇనుప ఖనిజం తరలిస్తున్నారంటూ.. జిల్లా అటవీశాఖ అధికారి కల్లోల్ బిశ్వాస్ తనిఖీకి వెళ్లారు. విధులకు ఆటంకం కలిగించారని బిశ్వాస్ ఫిర్యాదు చేశారు.