రవీంద్రను విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-07-13T11:19:43+05:30 IST

రవీంద్ర సతీమణి కొల్లు నీలిమను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆదివారం..

రవీంద్రను విడుదల చేయాలి

మచిలీపట్నం టౌన్‌, జూలై 12 : రవీంద్ర సతీమణి కొల్లు నీలిమను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆదివారం  పరామర్శించారు. అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడారు. మోకా భాస్కరరావు హత్య జరిగిన సమయంలో మాజీ మంత్రి  రవీంద్ర ఎస్పీ వద్ద ఉన్నారన్నారు. హంతకు లతో రవీంద్ర మాట్లాడినట్లు పోలీసులు అభూత కల్పన చేశారన్నారు.  మంత్రి పేర్ని నాని సైతం తాను విసిరిన సవాల్‌పై మాట్లా డటం లేదన్నారు. రవీంద్రను బేషరతుగా విడుదల చేయాలన్నారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకుడు రఘురామరాజు,  నాయకులు పరుచూరి ప్రసాద్‌, మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌  బాబా ప్రసాద్‌, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు, రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు కుంచే నాని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-13T11:19:43+05:30 IST