England vs India: జడేజా సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా

ABN , First Publish Date - 2022-07-02T21:10:59+05:30 IST

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్ మ్యాచ్)లో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.

England vs India: జడేజా సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌ (England)తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్ మ్యాచ్)లో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 338/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ (Team India) అదే నిలకడగా కొనసాగిస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 83 పరుగులతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరో 17 పరుగులు జోడించి టెస్టుల్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


మొత్తం 183 బంతులు ఎదుర్కొన్న జడేజా 13 ఫోర్లతో శతకం సాధించాడు.  అయితే, ఆ తర్వాత కాసేపటికే  అతడికి అండగా నిలిచిన షమీ (Mohammed Shami) అవుటయ్యాడు. 16 పరుగులు మాత్రమే చేసిన షమీ.. బ్రాడ్ బౌలింగులో జాక్ లీచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం జడేజా (102), బుమ్రా క్రీజులో ఉన్నారు. భారత్ 8 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కాగా, తొలి రోజు టాపార్డర్ కుప్పకూలిన వేళ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆపద్బాంధవుడయ్యాడు. 111 బంతుల్లో 20 ఫోర్లు, 4  సిక్సర్లతో 146 పరుగులు చేసి భారత్ పటిష్ఠ స్థితికి చేరుకోవడానికి పునాదులు వేశాడు.

Updated Date - 2022-07-02T21:10:59+05:30 IST