రావి శాస్త్రి శతజయంతి సభ
ABN , First Publish Date - 2022-07-29T05:49:00+05:30 IST
జూలై 30వ తేదీన ‘జనసాహితి’ సంస్థ నిర్వహణలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి శతజయంతి సభ జరగనున్నది...
జూలై 30వ తేదీన ‘జనసాహితి’ సంస్థ నిర్వహణలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి శతజయంతి సభ జరగనున్నది. విజయవాడ ప్రజాశక్తి నగర్ లోని శిఖామణి సెంటర్లో ఉన్న చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమం ఆరంభమవుతుంది. వేములపల్లి రాధిక సభాధ్యక్షులు. రావి శాస్త్రి శత జయంతిని పురస్కరించుకుని తెచ్చిన ప్రత్యేక సంచికను దుగ్గిరాల సత్యనారాయణ రెడ్డి ఆవిష్కరిస్తారు. తాటి శ్రీకృష్ణ, బి. అరుణ, అరసవిల్లి కృష్ణ, పెనుగొండ లక్ష్మీనారాయణ, వొరప్రసాద్, సింగంపల్లి అశోక్ కుమార్, బండ్ల మాధవరావు, దివికుమార్ వివిధ అంశాలపై ప్రసంగిస్తారు.
దివి కుమార్, అధ్యక్షుడు, జనసాహితి