రత్నప్రభను గెలిపించుకుందాం..

ABN , First Publish Date - 2021-04-13T03:56:24+05:30 IST

తిరుపతి నుంచి పోటీ చేస్తున్న ఏకైక మాదిగ అభ్యర్థి కే రత్నప్రభను గెలిపించుకుందామని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య

రత్నప్రభను గెలిపించుకుందాం..
విలేకరులతో బ్రహ్మయ్య మాదిగ

వెంకటాచలం, ఏప్రీల్‌ 12 :  తిరుపతి నుంచి పోటీ చేస్తున్న ఏకైక మాదిగ అభ్యర్థి కే రత్నప్రభను గెలిపించుకుందామని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పిలుపునిచ్చారు. మండలంలోని కసుమూరులో సోమవారం ఆయన మాదిగ నాయకులతో కలిసి  విలేకరులతో మాట్లాడారు. మాదిగలు 64 శాతం మందికి పైగా వైసీపీకి ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి మాలలు తప్ప మాదిగలు కనబడకపోవడం ఆవేదనకు గురి చేసిందన్నారు. బీజేపీ తన అభ్యర్థిగా రత్నప్రభను పెట్టి మాదిగలకు రాజకీయంగా న్యాయం చేస్తామని ప్రకటించడాన్ని ఎమ్మార్పీఎస్‌ స్వాగతిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు మంద వెంకటేశ్వరరావు, మంద పెంచలయ్య మాదిగ,  మంద పిచ్చయ్య మాదిగ, కోలగట్ల రమేష్‌ మాదిగ, కంటేపల్లి చెంగయ్యమాదిగ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T03:56:24+05:30 IST