మాస్కులు లేకుండానే రేషన్ షాపులకు జనం

ABN , First Publish Date - 2020-04-02T21:33:32+05:30 IST

నగరంలోని రేషన్ షాపుల దగ్గర జనం క్యూ కడుతున్న విషయం తెలిసిందే. రేషన్ సరుకుల కోసం జనం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.

మాస్కులు లేకుండానే రేషన్ షాపులకు జనం

హైదరాబాద్: నగరంలోని రేషన్ షాపుల దగ్గర జనం క్యూ కడుతున్న విషయం తెలిసిందే. రేషన్ సరుకుల కోసం జనం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొంతమంది సరైన అవగాహన లేకుండానే అక్కడికి చేరుకుంటున్నారు. ఇది మిగిలిన వారికి ఇబ్బందికరం కావడంతో.. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల నాయకులు మాస్కులు పంపిణీ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎల్బీ నగర్‌లోని ఓ రేషన్ షాపు దగ్గర.. స్థానిక కాంగ్రెస్ నాయకులు మాస్కులు పంపిణీ చేశారు. అంతేకాకుండా వారికి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. రేషన్ షాప్ డీలర్‌తో చర్చించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పన్యాల జైపాల్ రెడ్డి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. 

Updated Date - 2020-04-02T21:33:32+05:30 IST