రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-01-25T05:49:05+05:30 IST

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత

మాడ్గుల : రేషన్‌ బియ్యం పట్టుబడిన సంఘటన మండలంలోని నాగిళ్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన రోడ్డుపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కోల్కులపల్లి నుంచి నాగిళ్లవైపు వెళ్తున్న డీసీఎంను గుర్తించి ఆపారు. తనిఖీ చేయగా 30 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడింది. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, డీసీఎంను సీజ్‌ చేశారు. ఓనర్‌, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉపేందర్‌రావు తెలిపారు.

Updated Date - 2021-01-25T05:49:05+05:30 IST