రేషన్‌ బియ్యం పక్కదారి

ABN , First Publish Date - 2021-05-17T05:00:10+05:30 IST

తెల్లకార్డు లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ అందజేసిన బియ్యాన్ని కొనుగోలుచేసి వాటిని అనధికారికంగా వ్యాన్‌లో తరలిస్తుండగా విశాఖనగరం బాపూజీనగర్‌ ప్రాంతంలో వ్యాన్‌తో సహా శనివారం రాత్రి కంచరపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రేషన్‌ బియ్యం పక్కదారి

అక్రమంగ తరలిస్తుండగ 19 బస్తాలు స్వాధీనం

ముగ్గురిపై కేసు నవెదు

తాటిచెట్లపాలెం, మే 16: తెల్లకార్డు లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ అందజేసిన బియ్యాన్ని కొనుగోలుచేసి వాటిని అనధికారికంగా వ్యాన్‌లో తరలిస్తుండగా విశాఖనగరం బాపూజీనగర్‌ ప్రాంతంలో వ్యాన్‌తో సహా శనివారం రాత్రి కంచరపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 19 బస్తాల బియ్యాన్ని (855 కేజీలు) స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వేములవలసకు చెందిన సత్యవతి, అప్పలనాయుడు, ఏఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన నాగరాజులపై కేసు నమోదు చేశామని సీఐ కృష్ణారావు తెలిపారు.   

Updated Date - 2021-05-17T05:00:10+05:30 IST