రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-08-12T05:42:10+05:30 IST

మండలకేంద్రంలో బుధవారం ఉదయం అక్రమం గా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 129 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అ ధికారులు పట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పక్కా సమాచారం మేరకు రేషన్‌ బియ్యం నిల్వలపై దాడి చేసి పట్టుకున్నారు. షేక్‌ అయుఫ్‌, మహమ్మద్‌ సయాబ్‌లపై కేసు నమోదు చేశారు. వీరు ఐచర్‌ వాహనంలో బియ్యాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా, సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని పౌర సరఫరా శాఖ గోదాముకు తరలించారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

మోర్తాడ్‌, ఆగస్టు11: మండలకేంద్రంలో బుధవారం ఉదయం అక్రమం గా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 129 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అ ధికారులు పట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పక్కా సమాచారం మేరకు రేషన్‌ బియ్యం నిల్వలపై దాడి చేసి పట్టుకున్నారు. షేక్‌ అయుఫ్‌, మహమ్మద్‌ సయాబ్‌లపై కేసు నమోదు చేశారు. వీరు ఐచర్‌ వాహనంలో బియ్యాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా, సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని పౌర సరఫరా శాఖ గోదాముకు తరలించారు. వ్యాపారులు కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసు కొని మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి పరిసర గ్రామాల్లో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తారని అధికారులు తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియ కుండా నేరుగా దాడి చేసి పట్టుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఈదాడిలో ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ లక్ష్మయ్య, డిప్యూ టీ తహసీల్దార్‌లు వినోద్‌, రవీందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:42:10+05:30 IST