రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-08-12T06:01:26+05:30 IST
మండలంలోని ఎర్రగూడూరు గ్రామం వద్ద కేజీ రోడ్డుపై లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొన్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.
పాములపాడు, ఆగస్టు 11: మండలంలోని ఎర్రగూడూరు గ్రామం వద్ద కేజీ రోడ్డుపై లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొన్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. గురువారం నందికొట్కూర్కు చెందిన రామక్రిష్ణ, రఫి ఓ లారీలో నందికొట్కూర్ నుంచి గుంటూరుకు అక్రమంగా 290 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ సిబ్బందితో దాడిచేసి రేషన్ బియ్యాన్ని, లారీని స్వాదీనపరచుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.