గొడుగోనిపల్లిలో రేషన్ బియ్యం పంపిణీ షురూ
ABN , First Publish Date - 2022-08-12T05:30:00+05:30 IST
గొడుగోనిపల్లిలో రేషన్ బియ్యం పంపిణీ షురూ
దోమ, ఆగస్టు 12: మండల పరిధిలోని గొడుగోనిపల్లిలో సర్పంచ్ అమృతమ్మ ఆంజనేయులు శుక్రవారం రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా రేషన్ డీలర్ లేకపోవడంతో దోర్నాల్పల్లికి వెళ్లి రేషన్ బియ్యం తీసుకున్నామని, ఎమ్మెల్యే మహేశ్రెడ్డ్డి సహకారంతో గొడుగోనిపల్లిలో ఈనెల నుంచి రేషన్ సరుకులు అందజేయ నున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్ శంకర్, గ్రామస్తులు గోపాల్, యాదయ్య, శ్రీనివాస్, బాల్రెడ్డి, భీమయ్య, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.