రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-09-19T10:33:54+05:30 IST
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రెండు ఆటోలను సీజ్ చేసి ఇద్దరు డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. సంబంధిత డీలర్పై కూడా కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..
రెండు ఆటోలు సీజ్,
ఇద్దరు డ్రైవర్ల అరెస్టు
డీలర్పై కేసు నమోదు
గిద్దలూరు టౌన్, సెప్టెంబరు 18: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రెండు ఆటోలను సీజ్ చేసి ఇద్దరు డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. సంబంధిత డీలర్పై కూడా కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..
గిద్దలూరు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన నర్సిరెడ్డి అనే డీలర్ గురువారం అర్ధరాత్రి రెండు ఆటోలలో 60 సంచుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. సీఐ యు.సుధాకర్రావుకు సమాచారం అందడంతో ఏఎస్ఐ రంగయ్య, కానిస్టేబుళ్ళు ఉప్పలపాడుకు వెళుతుండగా మార్గమధ్యంలో రెండు ఆటోలు ఎదురుపడ్డాయి.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించిన పోలీసులు రెండు ఆటోలను పోలీసుస్టేషన్కు తరలించారు. శుక్రవారం ఇరువురు డ్రైవర్లను అరెస్టు చేసి సంబంధిత డీలర్పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రంగయ్య తెలిపారు.