రేషన్ బియ్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-04-17T04:53:35+05:30 IST
ఆత్మకూరు పట్టణ శివార్లలోని శ్రీశైలం రస్తాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యాన్ని శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆత్మకూరు,
ఏప్రిల్ 16: ఆత్మకూరు పట్టణ శివార్లలోని శ్రీశైలం రస్తాలో అక్రమంగా
తరలిస్తున్న రేషన్బియ్యాన్ని శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆత్మకూరు ఎస్సై నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పెద్దఅరవీడు
గ్రామానికి చెందిన దూదేకుల ఖాశీంవలి, దూదేకుల మస్తాన్ ఆత్మకూరు పరిసర
గ్రామాల్లో ఇంటింటా తిరిగి సేకరించి బియ్యాన్ని వారి గ్రామానికి
తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. 44బస్తాల రేషన్బియ్యాన్ని
స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు
వెల్లడించారు.