రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-04-22T05:38:22+05:30 IST

మండలంలోని తిరుపాడు గ్రామ సమీపంలో అక్రమంగా తరలుతున్న 30 బస్తాల రేషన్‌ బియ్యం, రెండు ఆటోలను బుధవారం ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి పట్టుకున్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

గడివేముల, ఏప్రిల్‌ 21: మండలంలోని తిరుపాడు గ్రామ సమీపంలో అక్రమంగా తరలుతున్న 30 బస్తాల రేషన్‌ బియ్యం, రెండు ఆటోలను బుధవారం ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి పట్టుకున్నారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలివి.. రామాంజనేయులు, సాధిక్‌, సుబ్రహ్మణ్యం రేషన్‌ బియ్యం తీసుకొని ఆటోలో నంద్యాలకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. రెండు ఆటోలు, రేషన్‌ బియ్యం సీజ్‌ చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-22T05:38:22+05:30 IST