220 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-17T05:37:45+05:30 IST

సంగంగోపాలపురం పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

220 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం
సంగంగోపాలపురంలో పట్టుబడిన రేషన్‌బియ్యంతో ఎస్‌ఐ రాంబాబు

వ్యాపారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

యడ్లపాడు, ఏప్రిల్‌ 16:  సంగంగోపాలపురం పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి అనుకుని ఉన్న ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నాయంటూ గురువారం రాత్రి సమాచారం రావడంతో దాడులు నిర్వహించామన్నారు.  రోడ్డుపై టార్పాలిన్‌ పట్టలను పరిచి నిల్వచేసిన 220 బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 105 క్వింటాళ్ళ బియ్యం ఉంటాయని, వీటి విలువ రూ.2లక్షలు ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. బియ్యాన్ని సేకరించి నిల్వ ఉంచిన సొలస గ్రామానికి చెందిన వ్యాపారి కోళ్ళమూడి సుబ్బారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-04-17T05:37:45+05:30 IST