అర్హులందరికీ రేషన్ కార్డులు
ABN , First Publish Date - 2020-06-06T10:06:23+05:30 IST
మండలంలో అర్హులందరికీ రేషన్కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జి.అప్పలనాయుడు అన్నారు.
భోగాపురం, జూన్ 5: మండలంలో అర్హులందరికీ రేషన్కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జి.అప్పలనాయుడు అన్నారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం సచివాలయ వీఆర్వోలతో ఆయన సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు వారం రోజుల్లో మంజూరయ్యేలా చూడాలన్నారు. కార్యక్ర మంలో హెచ్డీటీ గాంధీ, పౌర సరఫరాల అధికారి పిట్టా అప్పారావు, సర్వేయర్ వెంకటపతిరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.