అర్హులైన నిరుపేదలందరికీ రేషన్‌కార్డులు అందుతాయి

ABN , First Publish Date - 2021-07-31T07:17:34+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ రేషన్‌కార్డులు అందుతాయని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు.

అర్హులైన నిరుపేదలందరికీ రేషన్‌కార్డులు అందుతాయి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌

ఖానాపూర్‌, జూలై 30 : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ రేషన్‌కార్డులు అందుతాయని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏఎంకే ఫంక్షన్‌ప్యాలెస్‌లో నిర్వహించిన ఆహారభద్రతకార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమంకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలుసంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అనంతరం మండంలోని పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఆహారభద్రత కార్డులను అందజేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 431 మందికి నూతనంగా ఆహారభద్రత కార్డులు మంజూరు అయినట్లు తహసీల్దార్‌ నరేందర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అబ్దువిమొయిద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, జడ్‌పీటీసి ఆకుల రాజమణీ, వైస్‌ ఎంపీపీ గుగ్లావత్‌ వాల్‌సింగ్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌లు ఆమంద శ్రీనివాస్‌, సత్యనారాయణరెడ్డి, మార్కెట్‌ కమిటి వైస్‌ చైర్మన్‌ శనిగారపు శ్రావణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షులు తాళ్లపెల్లి రాజగంగన్న, నాయకులు కొక్కుల ప్రదీప్‌ తదితరులున్నారు. 


Updated Date - 2021-07-31T07:17:34+05:30 IST