రేషన్‌ కార్డు లేనివారికీ సాయం: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-04-03T07:21:55+05:30 IST

రేషన్‌కార్డు లేని పేదలకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పేదలు, కూలీలు..

రేషన్‌ కార్డు లేనివారికీ సాయం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డు లేని పేదలకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పేదలు, కూలీలు.. పీడీఎస్‌ ద్వారా అందించే నిత్యావసరాలను తీసుకోలేకపోతున్నట్లు గుర్తించామన్నారు. అందువల్ల వారికి రాష్ట్రాల విపత్తు స్పందన నిధి నుంచి నిత్యావసరాలు, వస్త్రాలతో పాటు వైద్య సేవలు కూడా అందించాలని కోరామన్నారు. పీఎంజీకేవై పథకాన్ని వినూత్నరీతిలో అమలు చేసిన పెద్దపల్లి కలెక్టర్‌ శిఖా పట్నాయక్‌ను కిషన్‌రెడ్డి ప్రశంసించారు.

Updated Date - 2020-04-03T07:21:55+05:30 IST