రచ్చబండకు ప్రజల నీరాజనం: వీర్లపల్లి శంకర్
ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST
రచ్చబండకు ప్రజల నీరాజనం: వీర్లపల్లి శంకర్
కొత్తూర్, జూలై 1: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి ప్రజలు నీరజనాలు పలుకుతున్నారని కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం శేరిగూడ బద్రాయపల్లి సర్పంచ్ అంబటి ప్రభాకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షాద్నగర్ నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రైతులు, రైతు కూలీలు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల నుంచి అనేక సమస్యలు సేకరించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అనేక సమస్యలను పెరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమావేశంలో నాయకులు అంబటి ప్రభాకర్, కొమ్ము కృష్ణ, దేపల్లి కుమారస్వామిగౌడ్, వీరమోని దేవేందర్, శేఖర్రెడ్డి, ఆంజనేయులు, సురేష్ పాల్గొన్నారు.