రాష్ట్ర సేవిక సమితి ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-20T03:55:03+05:30 IST

రాష్ట్ర సేవిక సమితి ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు

రాష్ట్ర సేవిక సమితి ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు

హైదరాబాద్: సాంస్కృతిక ఏకాత్మతను ప్రదర్శించేవి దసరా ఉత్సవాలు, ఇలాంటి ఉత్సవాలు సామాజిక సంతులనం కలిగి ఉంటాయి. ధర్మం కేవలం కాపాడుకుంటే నిలబడదు, ఆచరిస్తే నిలబడుతుంది” అని రాష్ట్ర సేవిక సమితి ప్రముఖ కార్యవాహిక మాననీయ అన్నదానం సీతా గాయత్రీ తెలిపారు. రాష్ట్ర సేవికా సమితి ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్‌లో జరిగిన విజయదశమి ఉత్సవంలో ప్రధాన వక్తగా ఆమె మాట్లాడుతూ భారతీయ మహిళ మన సంస్కృతికి అయివుపట్టు అని చెప్పారు. ‘‘తల్లి ఓడి తోలి బడి’ అని, అనాది నుండి మన తల్లులు ఈ ఆచారాన్ని కాపాడుతున్నారు. వీటి కేంద్రంగానే మన మాతృశక్తి పరంపర కొనసాగించాలనే లక్ష్యంతో వందనీయ మౌసీ జీ. 1936 సంవత్సరంలో రాష్ట్ర సేవికా సమితిని ప్రారంభించార‌ని తెలిపారు. గత 86 సం|| గా నిరంతరం సాగుతున్న ప్రయత్నం సమాజంలో దుష్ట శక్తి పోగొట్టేందుకు సేవికా స‌మితి కృషి చేస్తోంది.’’ అని సీతా గాయత్రీ చెప్పారు. 


సమితి నిర్వహించే శాఖల ద్వారా వ్యక్తి నిర్ణయం జరుగుతోంద‌న్నారు. ఈ మధ్య కాలంలో అవసరం లేకుండానే మన సంస్కృతి పై దాడి జరుగుతోందని, ఇటీవలే చీర కట్టడంపై ఢిల్లిలో జరిగిన ఘ‌ట‌న గురుంచి ఈ సంద‌ర్భంగా ఉదాహరించారు. మన సంస్కృతి పై జరిగే దాడులను, దురాచారాలను దూరం చేసేందుకు రాష్ట్ర సేవికా స‌మితి పని చేస్తోంద‌న్నారు. అనంత‌రం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరక్టర్ అఫ్ ఆడిట్ రైల్వేస్(దక్షిణ మధ్య రైల్వే) వై.దివ్యా గారు మాట్లాడుతూ సేవికా సమితి మాతృమూర్తులు చేస్తున్న‌టువంటి కృషి మహిళా సాధికారతకు ఉపయోగపడుతుంది అని అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ లో బండి గార్డెన్స్‌లో జరిగిన ఈ విజయదశమి ఉత్సవానికి సుమారు 600 మంది సేవికలు పాల్గొన్నారు


Updated Date - 2021-10-20T03:55:03+05:30 IST