ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రస్తారోకో

ABN , First Publish Date - 2021-12-02T06:15:48+05:30 IST

కళ్లాల్లో పోసిన వరిధాన్యాన్ని కొనుగోలు చే యాలంటూ మండలంలోని కమ్మునూర్‌ గ్రామ రైతులు బుధవారం రాస్తారోకో చేశారు.

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రస్తారోకో
రాస్తారోకో చేస్తున్న రైతులు

బీర్‌పూర్‌, డిసెంబరు 1 : కళ్లాల్లో పోసిన వరిధాన్యాన్ని కొనుగోలు చే యాలంటూ మండలంలోని కమ్మునూర్‌ గ్రామ రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై టెంటు వేసి రైతులు రోడ్డుపై బైఠాయించారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైస్‌ మిల్లర్ల దోపిడీని నిర్మూలించాలని నినాదాలు చేశారు. తహసీల్దార్‌ ఆ రీఫొద్దిన్‌, ఏఎస్‌ఐ గజేంధర్‌ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడి ధ ర్నాను విరమింప జేశారు. తప్పా తాలు పేరుతో క్వింటాలుకు 3 నుంచి 5 కిలోల వరకు ఎక్కువగా తూకం వేస్తేనే అన్‌లోడ్‌ చేస్తామని రైస్‌ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు లు తాటి తిరుపతి, తోట సంతోష్‌, నవ్వ రాయమల్లు, మల్లయ్య,  రవీంధ ర్‌, రత్నయ్య, లక్ష్మీరాజం, మల్లేశం, రాజలింగం పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-02T06:15:48+05:30 IST