దాడికి నిరసనగా బీజేపీ నాయకుల రాస్తారోకో

ABN , First Publish Date - 2022-05-20T04:44:34+05:30 IST

పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాల మధ్య పెద్దవాగు వంతెన వద్ద నిరసనదీక్షకు బయలు దేరిన బీజేపీనాయకులపై దాడిచేసి వాహ నాల అద్దాలను ధ్వంసం చేసిన టీఆర్‌ఎస్‌ గుండాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం మండలకేంద్రంలో బీజేపీ నాయ కులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నక విజయ్‌ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టడానికి వెళ్తుంటే అనుమతి లేదన్న సాకుతో పోలీసులు పాల్వాయి హరిష్‌బాబును అరెస్టు చేయడం సరైందికాదన్నారు.

దాడికి నిరసనగా బీజేపీ నాయకుల రాస్తారోకో
వాంకిడిలో రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు

వాంకిడి, మే 19: పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాల మధ్య పెద్దవాగు వంతెన వద్ద నిరసనదీక్షకు బయలు దేరిన బీజేపీనాయకులపై దాడిచేసి వాహ నాల అద్దాలను ధ్వంసం చేసిన టీఆర్‌ఎస్‌ గుండాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం మండలకేంద్రంలో బీజేపీ నాయ కులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నక విజయ్‌ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టడానికి వెళ్తుంటే అనుమతి లేదన్న సాకుతో పోలీసులు పాల్వాయి హరిష్‌బాబును అరెస్టు చేయడం సరైందికాదన్నారు. బీజేపీ నాయకుల వాహనాల అద్దాలను ధ్వంసం చేసిన టీఆర్‌ఎస్‌ గుండాలపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామగిరి శ్రావణ్‌, ఎస్టీ మోర్చా నాయకుడు ఆత్రంసాయినాథ్‌, కనకప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T04:44:34+05:30 IST