తిరుమలలో రాశీఖన్నా
ABN , First Publish Date - 2022-06-30T07:23:16+05:30 IST
హీరోయిన్ రాశీఖన్నా బుధవారం వేకువజామున తిరుమలేశుడిని దర్శించుకున్నారు.
తిరుమల, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): హీరోయిన్ రాశీఖన్నా బుధవారం వేకువజామున తిరుమలేశుడిని దర్శించుకున్నారు.తాను నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’ నిర్మాత ఎస్కేఎన్తో కలిసి అర్చన సేవలో పాల్గొన్నారు.శుక్రవారం విడుదల కాబోతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రం విజయవంతం కావాలని స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు.తర్వాత వెంగమాంబ అన్నప్రసాద భవనం చేరుకుని భోంచేశారు. ఈ సందర్భంగా రాశీఖన్నాను చూసేందుకు,ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు సినీ అభిమానులు పోటీపడ్డారు.