ఇప్పుడు అమ్మ ఉంటే..

ABN , First Publish Date - 2020-10-01T09:30:38+05:30 IST

ఢిల్లీతో మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకొన్న అనంతరం రషీద్‌.. దివంగతురాలైన తన తల్లిని ...

ఇప్పుడు అమ్మ ఉంటే..

భావోద్వేగానికి గురైన రషీద్‌

అబుదాబి: ఢిల్లీతో మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకొన్న అనంతరం రషీద్‌.. దివంగతురాలైన తన తల్లిని తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ అవార్డును అమ్మకు అంకితమిచ్చాడు. ఐపీఎల్‌లో తాను ఎప్పుడు అవార్డు సాధించినా తన తల్లి ఎంతో సంతోషించేదని రషీద్‌ గుర్తు చేసుకున్నాడు. ‘ఏడాదిన్నర కాలం ఎంతో కష్టంగా గడుస్తోంది. తొలుత నాన్న మరణించారు. గత జూన్‌లో అమ్మ కన్నుమూసింది. ఆ విషాదం నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. నాకు అమ్మే పెద్ద అభిమాని. ముఖ్యంగా ఐపీఎల్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన రోజు.. రాత్రంతా నాతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉండేది’ అని అవార్డు తీసుకున్న సందర్భంగా రషీద్‌ చెప్పాడు. 


Updated Date - 2020-10-01T09:30:38+05:30 IST