పోటీ పడి వాహనాల డ్రైవింగ్ చేసి చివరికిలా...!
ABN , First Publish Date - 2021-03-02T15:44:23+05:30 IST
పోటీ పడి అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపి
హైదరాబాద్/గచ్చిబౌలి : పోటీ పడి అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదానికి కారణమయ్యారు. ఆ ప్రమాదంలో రెండు వాహనాలు ఢీ కొని ఓ వాహన డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలి పోలీస్సేషన్ పరిధి విప్రో చౌరస్తా వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి బాలానగర్ నుంచి పవన్ అలియాస్ అనిల్(26), షఫీలు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డ్రిస్టిక్లోని అమెజాన్ పరిశ్రమకు రెండు హైడ్రాలిక్ క్రేన్ యంత్రాలను తరలిస్తున్నారు. విప్రో చౌరస్తా వద్ద ఇద్దరూ పోటీ పడి వేగంగా క్రేన్ యంత్రాలు నడిపారు. మూలమలుపు వద్ద అవి ఒకదానికి మరొకటి ఢీ కొన్నాయి. దీంతో పవన్ అలియాస్ అనిల్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.