ఆరు నెలల నుంచి మహిళకు పొత్తికడుపులో నొప్పి.. టెస్ట్ చేస్తే గర్భసంచిలో..
ABN , First Publish Date - 2020-07-03T20:24:48+05:30 IST
ఓ మహిళ గర్భసంచి నుంచి 24 కణితులను తొలగించిన సంఘటన సిద్దిపేటలో గురువారం చోటుచేసుకున్నది. చిన్నకోడూరు మండలానికి
గర్భసంచి నుంచి 24 కణితుల తొలగింపు
సిద్దిపేట(ఆంధ్రజ్యోతి): ఓ మహిళ గర్భసంచి నుంచి 24 కణితులను తొలగించిన సంఘటన సిద్దిపేటలో గురువారం చోటుచేసుకున్నది. చిన్నకోడూరు మండలానికి చెందిన 45 సంవత్సరాల మహిళ ఆరు నెలల నుంచి పొత్తికడుపులో నొప్పితో బాధపడుతున్నది. పలుచోట్ల వైద్యులకు కూడా చూపించుకున్నది. అయినా తగ్గకపోవడంతో బుధవారం సిద్దిపేటలో లోహిత్సాయి ఆసుపత్రిలో టెస్టులు చేయించారు.
గర్భసంచిలో 24 కణితులున్నట్టు తేలడంతో జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్డాక్టర్ అమిరిశెట్టి భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. అనంతరం డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ పొత్తి కడుపులో నొప్పి, నెలసరి రక్తస్రావము ఎక్కువగా ఉన్న మహిళలు ముందు జాగ్రత్తగా డాక్టర్లను కలిసి స్కానింగ్ పరీక్షలు చేయించుకుంటే ఇలాంటి విపరీతమైన సమస్యలు రాకుండా జాగ్రత్తపడొచ్చని చెప్పారు.