నా పేరు చెప్పి తప్పు చేస్తే వెంటనే చెప్పుతో కొట్టండి: ప్రకాశ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-17T22:48:37+05:30 IST

తన పేరు చెప్పి తప్పు చేస్తే వెంటనే చెప్పుతో కొట్టాలని, తనకు ఫోన్ చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు..

నా పేరు చెప్పి తప్పు చేస్తే వెంటనే చెప్పుతో కొట్టండి: ప్రకాశ్ రెడ్డి

రాప్తాడు: తన పేరు చెప్పి తప్పు చేస్తే వెంటనే చెప్పుతో కొట్టాలని,  తనకు ఫోన్ చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు సూచించారు. కొంతమంది రెవెన్యూ అధికారుల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల అవినీతి వల్ల జగనన్న కాలనీలకు భూములు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూములు కబ్జా చేసిన వారికి కోర్టులు స్టే ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. పరిటాల సునీత మంత్రి అయినప్పటి నుంచి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేశారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. 



Updated Date - 2022-01-17T22:48:37+05:30 IST